ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరుగుతున్న H3N2 వైరస్ కేసులు..

-

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతగా భయపెట్టిందో మర్చిపోకముందే ఇప్పుడు మరో వైరస్ కలవర పెడుతుంది.. H3N2 వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది..అయితే, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ ఫ్లూ లక్షణాలున్న రోగుల సంఖ్య పెరుగుతుండటంతో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. దేశంలో H3N2 వైరస్ టెన్షన్ పెరుగుతోంది. రెండు, మూడు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

మొదటిసారి రెండు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక, హర్యానాల్లో కొత్త వైరస్‌తో ఇద్దరు చనిపోయారు. కర్నాటక సైతం H3N2 మరణాన్ని ధ్రువీకరించింది. ఇకపోతే దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.. తెలుగు రాష్ట్రాల్లోనూ H3N2 వైరస్ కలవరం పెడుతోంది. ఫీవర్ హాస్పిటల్స్ సహా అన్ని ఆస్పత్రులూ కిటకిటలాడుతున్నాయి. కరోనా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో.. అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలంటున్నారు వైద్యులు.

ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 100కి పైగా హెచ్‌3ఎన్‌2 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఫ్లూ లక్షణాలున్నవారు బయటకు తిరగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. ఆ వైరస్ లక్షణాలు ఉన్న పిల్లలను స్కూల్ కు కూడా పంపొద్దని అధికారులు చెబుతున్నారు.. వ్యాధి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని వెంటనే స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఇక ఈ వ్యాధితో ఇంకెంతమంది పోతారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version