బాలయ్య నియోజకవర్గం హిందూపురంలో టెన్షన్.. నేడు బంద్ కు పిలుపు

-

వారం రోజుల కిందట… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 23 జిల్లాలుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఉన్నట్టుండి జిల్లాలపై ప్రభుత్వం ప్రకటన చేయడంతో…. చాలా వర్గాలు, ప్రాంతాల నుంచి వ్యతిరేకత వస్తోంది.

అందులో నందమూరి బాలయ్య నియోజకవర్గమైన హిందూపురం కూడా ఉంది. హిందూ పురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ హిందూపురం నియోజకవర్గంలో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ ఈ కార్యక్రమానికి సంఘీభావంగా వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసి వేయాలని నిర్ణయించారు.

హిందూపురం ను జిల్లా కేంద్రం చేయాలని ఇప్పటికే తన నిర్ణయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తుంది. అనంతరం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని హిందూపురం వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు హిందూపురం జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ బందుకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news