దళిత బంధుకు రూ.30 వేల కోట్లు కేటాయింపు : హరీష్ రావు

-

రెండున్నరేళ్ల లో తెలంగాణ లో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తామని.. వచ్చే సంవత్సరం దళిత బంధు పథకం క్రింద బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు కేటాయింపులు చేస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. దళిత బంధు తో తమ కాళ్ళ మీద తాము నిలబడేలా నిధులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

రైతు బంధు మాదిరే దళిత బంధు దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తుందని.. దళిత జాతికి సరికొత్త దశా దిశా చూపే కార్యక్రమం దళిత బంధు అని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చెప్పిన అన్ని కార్యక్రమాలు సిఎం కేసిఆర్ అమలు చేసి చూపారని…ఇక ముందు అదే తీరులో ముందుకు వెళతామని వెల్లడించారు. అదే స్ఫూర్తి తో దళిత బంధు అమలు చేసి తీరుతామని చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. తెలంగాణ అభివృద్ది ఒక టిఆర్ఎస్ పార్టీ తోనే అవుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news