చంద్రబాబు కుట్రలో భాగమే అమరావతి రైతుల పాదయాత్ర – మంత్రి విడదల రజిని

-

వైజాగ్ లోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ విస్తృత తనిఖీలు చేపట్టారు. అనంతరం విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ.. ఈ వయసులో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయలేరని.. లోకేష్ పాదయాత్ర చేసినా జనం విశ్వసించరని అన్నారు. అందుకే అమరావతి రైతుల పేరిట చంద్రబాబు నాయుడు పరోక్షంగా పాదయాత్ర చేయిస్తున్నారని ఆరోపించారు. అమరావతి రైతుల పేరిట జరగే పాదయాత్రలో జరిగే పరిణామాలకు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలన్నారు.

అమరావతి ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు ఎలాంటి విద్వేషాలు లేవు… అందరూ తెలుగువారేనన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమే ఈ అమరావతి రైతుల పాదయాత్ర అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే విశాఖ, కర్నూలు, అమరావతి లను సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానిగా గుర్తించారని అన్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా మూడు రాజధానుల ప్రక్రియ ముందుకు వెళుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news