ఆంబోతు విమర్శలపై చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అంబటి రాంబాబు

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆంబోతు.. ఆంబోతు..’ అంటూ తనను విమర్శించడంపై చంద్రబాబు నాయుడు కి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.చంద్రబాబు పెద్ద చీటర్ 420 అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపై విమర్శలు చేసే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని ,లేదంటే చంద్రబాబు చరిత్ర అంతా ప్రజల ముందు ఉంచుతానని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

దివంగత మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు మృతికి టీడీపీ చీఫ్ చంద్రబాబే కారణమని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారు. ఆయన కుటుంబాన్ని బాబు నమ్మించి వంచించారు అని ఆరోపించారు . కోడెల కుటుంబానికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేశారు అని విమర్శించారు. కోడెల కుటుంబంపై ఇంకా కక్ష సాధిస్తున్నారు. టీడీపీ మునిగిపోతున్న నావ, చంద్రబాబు ఒక చీటర్. ఆంబోతులకు ఆవులను సప్లై చేసే వ్యక్తి’ అని ఆయన విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version