నేడు హైదరాబాద్​కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. సర్దార్‌ వల్లభ్​ భాయ్‌ పటేల్‌ పోలీస్‌ అకాడమీలో రేపు జరిగే ఐపీఎస్‌ల పరేడ్‌లో పాల్గొనేందుకు.. ఈరోజు రాత్రి 10:15 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి సర్దార్‌ వల్లభ్​భాయ్​ పటేల్‌ పోలీస్‌ అకాడమీకి రోడ్డుమార్గం ద్వారా రాత్రి 10:40 గంటలకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు.

రేపు ఉదయం 7:50 గంటల నుంచి 10:30 గంటల వరకు సర్దార్‌ వల్లభ్ ​భాయ్‌ పటేల్‌ పోలీస్‌ అకాడమీలో నిర్వహించే ఐపీఎస్ పరేడ్​లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పరేడ్‌ అనంతరం 11 నుంచి 12 గంటల వరకు అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు భోజన విరామం అనంతరం.. నేషనల్‌ పోలీస్‌ అకాడమీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి 1:20 గంటలకు చేరుకుంటారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు అమిత్ షా దిల్లీకి తిరుగు పయనం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news