BREAKING : ఏపీలో మరో ఘోరం..తృటిలో తప్పిన రైలు ప్రమాదం

-

BREAKING : ఏపీలో మరో ఘోరం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని కుటాగుళ్ళ రైల్వే గేట్ వద్ద తృటిలో తప్పింది రైలు ప్రమాదం. రైలు వచ్చిన సమయంలో గేట్ వేయకుండా నిర్లక్ష్యం వహించాడు రైల్వే ఉద్యోగి. ఈ తరుణంలో పెద్ద ప్రమాదమే జరిగేది.

నిత్యం రద్దీగా వాహనాలు తిరిగే చెన్నై హైవే పై ఉంది రైల్వే గేట్. వాహనాలు తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా రైలు రావడంతో అవాక్కయ్యారు వాహనదారులు. గేట్ వేయకపోవడం గమనించి రైలు నిలిపివేశారు లోకో పైలెట్. నాగర్ కోయిల్-చెన్నై రైలు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version