సత్యసాయి జిల్లాలో ప్రమాదం సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

-

శ్రీ సత్యసాయి జిల్లా ఆటో ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రమాద ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయ పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విదేశాల నుంచి అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్.. అన్నీ చర్యలు తీసుకోవాలన్నారు.

అటు సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో విద్యుత్ వైర్లు తెగిపడి ఆటోలో పలువురు సజీవ దహనం ఘటన పై తీవ్ర విచారం వ్యక్తం చేసారు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సిఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నామని పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అన్నీ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే సత్యసాయి జిల్లా ఘోర ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్.. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి, దానిలో ప్రయాణిస్తున్న కూలీల మృతి విచారకరమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news