అన్న క్యాంటిన్లలో భోజన పంపిణి ప్రారంభించనున్న చంద్రబాబు..!

-

అక్షయపాత్ర వంటశాలను పరిశీలించిన మంత్రి నారాయణ అంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 180 అన్న క్యాంటిన్లు నడిపాం. 4.60 కోట్ల మందికి భోజనాలు రూ.5 కే అందించాం. రిశుభ్రమైన వాతావరణంలో మంచి భోజనం పేదలకు పెట్టాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటిన్లు తెరవాలని నిర్ణయించాం. రాష్ట్రంలో అన్ని అన్నా క్యాంటిన్లను సిద్ధం చేశాం.

అన్నా క్యాంటిన్లకు ఆహార పంపిణీ కాంట్రాక్టు అక్షయపాత్ర దక్కించుకుంది. ఈనెల 15వ తేదిన గుడివాడలో అన్నా క్యాంటిన్ ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 15వ తేదీ మధ్యాహ్నం భోజన పంపిణి ప్రారంభిస్తారు. ఆగస్టు 16వ తేదీన 100 క్యాంటిన్లు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 180 క్యాంటిన్లు అందుబాటులో వస్తాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ మరో 200కు పైగా అన్నా క్యాంటిన్లు ప్రారంభించాలనేది మా ప్రణాళిక. పేద వర్గాలు ఎక్కువగా తిరిగే మార్కెట్లు, ఆసుపత్రుల వద్ద క్యాంటిన్ల ఏర్పాటు జరుగుతుంది అని మంత్రి నారాయణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version