మోపిదేవి వెన్నకి రావాలని కోరిన అంబటి..!

-

ప్రస్తుత రాజకీయాలలో విలువలు తగ్గాయి అనుకుంటున్నా అంటూ అంబటి రాంబాబు అన్నారు. మోపిదేవి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో కూడా పని చేసిన వ్యక్తి.. వైఎస్ జగన్ క్యాబినెట్ లో పని చేసారు. నేను గెలిచినా నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయినా మోపిదేవి కి మంత్రి పదవి ఇచ్చారు. అలాంటి మోపిదేవి పార్టీ నుండి వెళ్తారని అనుకోవడం లేదు. ఏదైనా భాద కలిగినా వెనక్కు రమ్మని కోరుతున్నా అని రాంబాబు పేర్కొన్నారు.

అలాగే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరు పార్టీలు మారి చంద్రబాబుతో వెళ్లిన కాల గర్భంలో కలసి పోవడమే. టీడీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందే ఎంఎల్ఏ ల దెబ్బకు అవినీతి కంపు లో కూరుకుపోయారు. PDS బియ్యం రాష్ట్రం లో ఎలా బ్లాక్ మార్కెట్కు తరలి పోతుందో మంత్రికి తెలియడం లేదా. రేషన్ మాఫియా వద్ద MLAలు లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు అని అంబటి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version