పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో త్వరలోనే వైట్ పేపర్ ఇస్తాం – అంబటి

-

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో త్వరలోనే వైట్ పేపర్ ఇస్తామని ప్రకటించారు అంబటి రాంబాబు. ఉద్దేశ్య పూర్వకంగా పోలవరం ప్రాజెక్ట్‌కి వైసీపీ అడ్డంకి అని చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖకి లేఖ రాశారని.. మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు బాబు వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అలసత్వం వల్లనే పోలవరం పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రాన్‌స్ట్రయ్ ను తీసి నవయుగకి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చింది బాబు అని.. చంద్రబాబు రాసిన లేఖను కేంద్రం చూడను కూడా చూడదు చెత్త బుట్టలో వేస్తారని చురకలు అంటించారు. పోలవరం కుంటు పడింది అని చెప్పాలని ఉద్దేశ్యంతో ఈ లెటర్ రాసారని.. పోలవరం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్ వే, ఇతర పనులు పూర్తి చెయ్యలేదని.. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం చంద్రబాబు, దేవినేని ఉమ వైఖరి అని ఫైర్‌ అయ్యారు. డయాఫ్రమ్ వాల్ ఎంతవరకు దెబ్బతిందో కూడా చెప్పలేని పరిస్థితిఅని.. అసెంబ్లీలో పోలవరం పై చర్చ జరుపుదామని వెల్లడించారు.
శాసనసభ సాక్షిగా డయాఫ్రామ్ వాల్ ఎలా కొట్టుకుపోయింది చర్చిద్దామని.. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో త్వరలోనే వైట్ పేపర్ ఇస్తామని ప్రకటించారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news