ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం…ల్యాండ్ టైటిలింగ్‌, ఇసుక విధానంపై కీలక నిర్ణయం

-

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్‌, ఇసుక విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినేట్‌. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనుంది చంద్రబాబు ప్రభుత్వం.

ap cabinet chandrababu

అటు పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషనుకు ప్రభుత్వ గ్యారెంటీకి కెబినెట్ ఆమోదం తెలిపింది.

  • ముగిసిన కెబినెట్.
  • ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కెబినెట్ ఆమోదం.
  • కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం.
  • కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనున్న ప్రభుత్వం.
  • పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రి వర్గం ఆమోదం.

Read more RELATED
Recommended to you

Exit mobile version