BREAKING : 29న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా

-

ఏపీ కేబినెట్ సమావేశానికి బ్రేక్‌ పడింది. ఈ నెల 29న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. దీంతో తిరిగి సెప్టెంబర్ 1వ తేదీన కేబినెట్ భేటీ జరుగుతుందని వెల్లడించింది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల 29న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా వేసుకుంది ఏపీ సర్కార్‌.

ఇది ఇలా ఉండగా… ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లాలోని పెడనలో వైయస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు సీఎం జగన్. దీంతో వైయస్సార్ నేతన్న నేస్తం కింద ఈ సందర్భంగా 80,546 మంది ఖాతాల్లో రూ. 24 వేల చొప్పున రూ.193.31 కోట్లను సీఎం జగన్‌ జమ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news