ఏపీ రైతులకు గుడ్ న్యూస్..నేడు రైతులకు ధాన్యం బకాయిలు విడుదల

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇవాళ రైతులకు ఖాతాలలో ధాన్యం బకాయిలను జమ చేయనుంది టిడిపి కూటమి సర్కార్. గత రబీ సీజన్ లో ధాన్యం విక్రయించిన… 35374 మంది రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. దీనికోసం 674.47 కోట్ల రూపాయలను సిద్ధం చేసింది.

ఈ డబ్బులను ఇవాళ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రిలీజ్ చేయబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ కార్యక్రమం జరిగే ఛాన్స్ ఉంది. ఏలూరులో జరిగే కార్యక్రమంలో ఎందుకు సంబంధించిన చెక్కులను రైతులకు నాదెండ్ల మనోహర్… ఇవ్వబోతున్నారు. ఇది ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో 82,000 మందికి 657 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో సగం మందికి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గత నెలలో.. 1000 కోట్ల వరకు అందజేసింది. ఇక ఇప్పుడు మిగతా డబ్బులను జమ చేయబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version