శ్రీలంక కంటే 4 రెట్లు అధికంగా ఏపీ అప్పు చేసింది – పయ్యావుల కేశవ్

-

శ్రీలంక కంటే నాలుగు రెట్లు అధికంగా ఏపీ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్.రాష్ట్రం శ్రీలంక దిశగా సాగుతోందని 4 నెలల నుంచి మేం చెప్తోందే నిన్న కేంద్రమూ చెప్పిందన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం జరిగి తీరాలన్నారు.శ్రీలంక కంటే 4రెట్లు అధికంగా ఏపీ అప్పు చేసింది, సంక్షోభం తలెత్తక మరేమవుతుంది..? అంటూ ప్రశ్నించారు.ఆర్థికమంత్రి సీఏజీ పూర్తిస్థాయి ఆడిట్ కు సిద్ధపడతారా..? లేక శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అని డిమాండ్ చేశారు.

తమ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే.. ప్రత్యేక ఆడిట్ కు సిద్ధమా..?చేస్తున్న అప్పులకు ఎందుకు లెక్కలు చూపట్లేదనీ ప్రశ్నించారు.పీఏసీ ఛైర్మన్ హోదాలో నేనడిగిన వాటికి లెక్కల వివరాలు చెప్పట్లేదు,
రాష్ట్రానికి సంబంధించి వందలాది పీడీ అకౌంట్లకు లెక్కలు లేవు, దీనిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఇంకా మెతక వైఖరితో ఉండటానికి రాజకీయ కారణాలా లేక సమాఖ్య స్ఫూర్తా అనేది అర్థం కావట్లేదన్నారు.

కేంద్రం కూడా అప్పులు చేసి తప్పు చేస్తోందని వైసీపీ భావిస్తే, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లోనే నిలదీయొచ్చు కదా..?అన్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం తప్పిదాలు చేస్తోందని ఎండగడుతుంటే, ఏపీ అధికారపార్టీ ఎందుకు మౌనం వహిస్తోంది..? అని ప్రశ్నించారు పయ్యావుల కేశవ్.పులులు అని చెప్పుకునేవారు ఏ విషయంలో కేంద్రాన్ని నిలదీయకపోవటం గత కొంతకాలంగా చూస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news