పేర్ని నానిపై జనసేన కార్యకర్తల దాడి..!

-

మాజీ మంత్రి, YCP నేత పేర్ని నానిపై జనసేన కార్యకర్తల దాడి చేసారు. అయితే తాజాగా పేర్ని నాని గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న జనసేన కార్యకర్తల.. పేర్ని నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నాని కార్ల పై గుడ్లు, రాళ్లతో దాడి చేసారు. దాంతో ప్రస్తుతం అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

అయితే ఎన్నికల సమయంలో పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యక్తలు చేసాడు అని జనసేన కార్యకర్తల ఆరోపిస్తున్నారు. కాబట్టి పేర్ని నాని క్షమాపణ చెప్పేవరకు ఆయనని వైసీపీ నేత తోట శివాజీ ఇంటి నుండి వెళ్లనిచ్చేది లేదు అంటూ జనసేన కార్యకర్తలు, వీర మహిళాలు నినాదాలు చేస్తున్నారు. అలాగే తోట శివాజీ ఇంటి బయట ఉన్న మరో YCP నేత పాలేటి చంటి కారు అద్దాలు కూడా పగలగొట్టారు జనసేన కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version