ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జగనన్న విద్యా దీవెన కౌన్సిలింగ్ తేదీలు ఖరారు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. జగనన్న విద్యా దీవెన పథకంపై కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 28,29 తేదీల్లో జగనన్న విద్యా దీవెన కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటన చేసింది.

జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి దరఖాస్తు చేసిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల విద్యార్థులకు ఈనెల 28, 29 తేదీల్లో తాడేపల్లిలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. భారత్ లో ఉన్న విద్యార్థులకు ఈ నెల 28న కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కాపు కార్పొరేషన్ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు తర్వాత విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు ఈ పథకం కింద ఎంపిక చేసేందుకు వారి తల్లిదండ్రులకు ఈనెల 29న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news