వైసీపీ ఎమ్మెల్సీ అనంత డ్రైవర్‌ మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌..రూ.20 వేల కోసమే హత్య ?

-

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్‌ మృతి కేసులో మృతుడు సుబ్రహ్మణ్యం భార్య, తల్లి, కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఉదయం అనంత బాబు వచ్చి సుబ్రహ్మణ్యం ను తీసుకుని వెళ్లారని… ఐదు నెలల క్రిందట డ్రైవర్ గా పని చేసి మానేశారని వెల్లడించారు. 20 వేలు అనంత బాబు కి ఇవ్వాలని.. డబ్బులు ఇవ్వక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

నెలకు ఐదు వేలు చొప్పున ఇస్తామని చెప్పారు కుటుంబ సభ్యులు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. నిన్న ఉదయం పని ఉందని చెప్పి సుబ్రహ్మణ్యంను అనంత బాబు తీసుకుని వెళ్లారట. రాత్రి ఫ్రెండ్ బైక్ ఇచ్చి టిఫిన్ కి పంపించామని కుటుంబ సభ్యులకు చెప్పాడు ఉదయ్ బాబు.

అయితే.. బైక్ స్తంభాన్ని ఢీకొనడంతో చనిపోయాడని ఎమ్మెల్సీ చెప్పాడు అంటున్నారు కుటుంబ సభ్యులు. కారులో మృతదేహాన్ని తీసుకుని వచ్చి దింపమని చెప్పారు ఉదయ బాబు. అయితే.. దాన్ని నిరాకరించి కారుకు అడ్డంగా పడుకున్నారు కుటుంబ సభ్యులు. దాంతో వేరే కారు లో వెళ్ళిపోయారు ఉదయ బాబు. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news