అన్నమయ్య జిల్లాలో దారుణం.. ఇద్దరూ పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్న తల్లి..!

-

రోజు రోజుకు దేశవ్యాప్తంగా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టాలని ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినప్పటికీ విఫలం అవుతూనే ఉన్నారు. ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినప్పటికీ ఏదో ఒక కారణంగా ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. కొంతమంది వ్యక్తి గతంగా కావాలని ప్రమాదాలకు దారి తీస్తుంటే.. మరికొన్ని సందర్భాల్లో అనుకోకుండా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం -కొత్తపేటలో ఓ తల్లితో పాటు తన ఇద్దరూ పిల్లలకు పెట్రోల్ పోసి తాను కూడా నిప్పంటించుకుంది. దీంతో ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మరణించారు. ఈ మంటలకు ఇంట్లో ఉన్న సిలిండర్లు కూడా పేలిపోయినట్టు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఆ మహిళా భర్త విదేశాల్లో ఉంటున్నట్టు సమాచారం. ఈ ప్రమాదానికి కారణాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version