వెంటాడుతోన్న గతం: లాజిక్ తో బాబు నోటికి తాళం వేస్తోన్న బొత్స!

-

ప్రస్తుతం ఏపీలో అమరావతి పేరు చెప్పిన బాబు బండారం మొత్తం బయటకు లాగేస్తున్నారు వైకాపా నేతలు! బాబు ద్వంద్వ సిద్ధాంతాలను, రెండు కళ్ల ధోరణిలను, వాటి వల్ల ఇప్పటివరకూ ఆంధ్రులకు జరిగిన నష్టాన్ని మరోసారి గుర్తుకుతెస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మైకందుకున్నారు ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ!

నేడు అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండాలని.. తన ఉద్దేశ్యం ప్రకారం ఆ ప్రాంతం మాత్రమే బాగుపడాలని బాబు వాదిస్తోన్న సంగతి తెలిసిందే. దానికోసం రాజకీయ రచ్చ చేస్తోన్నారు. ఆన్ లైన్ లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి డెడ్ లైన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో మైకందుకున్న బొత్సా సత్యనారాయణ… ఈ ఉత్సాహం “సమైక్య్యాంధ్ర” ఉద్యమ సమయంలో ఏమైందని ప్రశ్నిస్తున్నారు.

అవును… మూడు ప్రాంతాల అభివృద్ధికి తొలిమెట్టైన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు డెడ్ ‌లైన్లు పెడుతూ, సవాళ్లు విసురుతున్న చంద్రబాబు… రాష్ట్ర విభజన సమయంలో ఎందుకు డెడ్‌ లైన్లు పెట్టలేదని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన పనికిమాలిన సవాళ్లు చేస్తే.. తామెందుకు స్పందించాలని అంటున్నారు. ఆలోచిస్తే… నిజమే కదా అంటున్నారు విశ్లేషకులు!

నేడు అమరావతి విషయంలో చంద్రబాబు సాధించేది ఏమీ లేకపోయినా… నాడు సమైక్యాంధ్ర ఉధ్యమ సమయంలో, కేంద్రంలో చక్రాలు గట్రా తిప్పే రోజుల్లో… రాష్ట్ర విభజనను అడ్డుకుని ఉంటే బాగుండేది. నాడు రెండు కళ్ల సిద్ధాంతం అని ఏపీకి అన్యాయం చేసిన చంద్రబాబు… తనదైన రాజకీయంతో మరోసారి ఏపీ వాసులకు అమరావతి పేరు చెప్పి అన్యాయం చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు!!

Read more RELATED
Recommended to you

Latest news