పరిపాలనా రాజధానిగా విశాఖ వద్దనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి – బొత్స

-

విశాఖను పరిపాలన రాజధానిగా వద్దనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖను పరిపాలన రాజధానిగా ఎందుకు వద్దంటున్నారు ఉత్తరాంధ్ర టిడిపి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ సామాజిక వర్గానికి రాష్ట్ర సంపాదను దోచిపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విశాఖ పరిపాలన రాజధాని అనేది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్ష అన్నారు.

అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందారనేదే సీఎం జగన్ విధానమని స్పష్టం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అమరావతికి 6000 కోట్లు ఖర్చు చేశారని.. అందులో 4,500 కోట్లు అప్పుచేసికోట్లు అప్పు చేసి ఖర్చు చేశారని అన్నారు. ఏ సినిమా నటుడు వచ్చినా ప్రజలు చూడడానికి వస్తారని.. పవన్ కళ్యాణ్ వచ్చినంత మాత్రాన రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల మనసు మారదు అన్నారు. చనిపోయిన సిల్క్ స్మిత వచ్చినా ఇంతకంటే ఎక్కువ మంది వస్తారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news