BREAKING : చంద్రబాబు పీఏ సహా 45 మందిపై కేసు నమోదు

-

BREAKING : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్‌ షాక్‌ తగిలింది. నారా చంద్రబాబు నాయుడు పీఏ సహా 45 మందిపై కేసు నమోదు అయింది. చిత్తూరు – కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెలుగు దేశం పార్టీ నాయకులపై రామకుప్పం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

తెదేపా నేతలు తన విధులకు ఆటంకం కలిగించారని, ఎస్సై డౌన్‌ డౌన్‌ అన్న నినాదాలతో పోలీస్‌స్టేషను ఎదుట ధర్నా చేపట్టి ఫిర్యాదుదారులను స్టేషన్‌కు రానివ్వకుండా అడ్డుకోవడంతోపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని రామకుప్పం హెడ్‌కానిస్టేబుల్‌ మణి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ సహా 45 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news