సుప్రీంకోర్ట్ మొట్టికాయలు వేసినా చంద్రబాబుకు సిగ్గు రాలేదు – మంత్రి మేరుగ

-

తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మేనిఫెస్టో పై స్పందించారు మంత్రి మేరుగ నాగార్జున. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహానాడులో అబద్దాలతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. పేదలకు సెంటు భూమి ఇస్తే తట్టుకోలేని చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తారా..? అని ప్రశ్నించారు.

ప్రజలకు ఏమి గుర్తు ఉండదు, అన్నీ మర్చిపోతారనే ఉద్దేశంతోనే మహానాడులో ఈ మేనిఫెస్టో ప్రకటించారని మండిపడ్డారు. పేద ప్రజలను అణగదొక్కాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారని.. సుప్రీం కోర్ట్ మొట్టికాయలు వేసిన చంద్రబాబుకు సిగ్గు రాలేదని విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో నాలుగు రోజుల తర్వాత ఎక్కడ ఉంటుందో తెలియదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version