తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని.. ప్రజల కష్టాలు తొలగిపోతాయని చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు రేవేంద్ర పాడు వద్ద నిరసన చేస్తున్న రైతులను పరామర్శించారు. నేను పర్యటనకు వస్తున్నానని సీఎం జగన్ హడావుడిగా బయలుదేరారు. పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడ అని ప్రశ్నించారు. పంట నష్టపరిహారం నేను పెంచుకుంటూ వెళ్తే.. జగన్ తగ్గించారు. కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితి ఉందని విమర్శించారు.

మరోవైపు తెలంగాణ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అహంకారంతో విర్రవీగితే ఏమవుతుందో ఇటీవలే తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో చూశాం.. మరో మూడు నెలల్లో  ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తామని ఆసక్తికర విషయాలను వెల్లడించారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. నన్ను జైలులో పెట్టించిన భయం జగన్ ను వెంటాడుతోంది. చేయని తప్పుకు నన్ను జైలులో పెట్టారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version