జర్నలిస్టులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. రూ. 2 లక్షల వరకు !

-

cm chandrababu naidu good news to ap journalists: ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వర్కింగ్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ను 2024-25 ఆర్థిక సంవత్సరానికి కూడా పొడిగించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం తెలిపారు.

cm chandrababu naidu good news to ap journalists

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పొడగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా…. ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. పాత్రికేయుల ఆరోగ్య భీమా ద్వారా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు అనారోగ్యం సంభవించినప్పుడు రూ. 2లక్షల విలువైన వైద్య చికిత్సలు చేయించుకునే వీలుంటుంది. ఇలా సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని హిమాన్షు శుక్లా తెలిపారు. ఇక దీనిపై చంద్రబాబును ప్రశంసిస్తూ… జర్నలిస్ట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version