సూడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని వెనక్కి రప్పించేందుకు జగన్‌ కీలక నిర్ణయం చర్యలు

-

సూడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. స్వస్థలాలు చేరేంతవరకూ అండగా నిలవాలని పేర్కొన్నారు సీఎం జగన్‌. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని.. సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.

స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి… విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎయిర్‌పోర్టులో రిసీవ్‌ చేసుకుని వారి స్వస్థలాలకు చేరుకునే వరకు అండగా నిలవాలన్నారు సీఎం జగన్. సుడాన్‌లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు అంచనా వేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Read more RELATED
Recommended to you

Latest news