రేపు నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన

-

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం జగన్. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10:25 గంటలకు నర్సీపట్నం మండలం బలిగట్టం గ్రామానికి చేరుకుంటారు సీఎం జగన్.

అక్కడి నుండి 11:15 గంటలకు జోగునాధుని పాలెం చేరుకొని నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కలాశాల నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం తాండవ – ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు అక్కడి నుండి బయలుదేరి మూడు గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news