ఇవాళ తిరుపతి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

-

CM Jagan : ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం జగన్ తిరుపతి జిల్లా పర్యటన ఖరారు అయింది. సీఎం జగన్ ఇవాళ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తడ మండలం మాంబట్టు గ్రామంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ కు చేరుకుంటారు.

CM Jagan’s visit to Tirupati district today

అక్కడ ఫిషరీస్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖకు చెందిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తడ మండలం మాంబట్టులో ముఖ్యమంత్రి జగన్ తో కలిసి ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో పాల్గొంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version