సిఎం జగన్ కు దేవినేని సవాల్.. దేనికైనా సిద్దమే !

-

పోలవరం ప్రాజెక్టులో డయఫ్రం వాల్ కట్టడం చారిత్రక తప్పిదం అనడం అవివేకమని.. దీనిపై సి.ఎం. జగన్ సిద్ధమా ? సవాల్ చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. చర్చ తాడేపల్లి ప్యాలెస్ లోనైనా, పోలవరం ప్రాజెక్టు వద్దనైనా సిద్దమని.. వైసీపీ పాలన లో ఎంత శాతం పనులు పూర్తి చేశారో సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల డబ్బులు రంపచోడవరం.. వైసీపీ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు దోపిడీ చేశారన్నారు.


నిర్వాసితుల డబ్బులు తినేశారని.. జగన్ అవినీతి వల్ల పోలవరం నిర్లక్ష్యానికి గురైందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కు దమ్ముంటే ప్రదాని ని ఏమి అడిగావో మీడియా కు చెప్పాలని.. ఇద్దరు మంత్రుల సమక్షంలో ఇరిగేషన్ ఇంజనీర్ సూర్య కిరణ్ ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొడతారా ? అని నిలదీశారు. ఇరిగేషన్ ఇంజనీర్ ను ఎమ్మెల్యే కొట్టినందుకు మంత్రి అంబటి రాంబాబు సిగ్గు పడాలన్నారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఏఈ సూర్య కిరణ్ ను ఎమ్మెల్యే కొట్టినందుకు ముఖ్యమంత్రి జగన్ సిగ్గుపడాలని.. ఏఈఈ ని కొట్టిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పై పోలీసులు
కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news