ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల..

-

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఏపీ పిజి సెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..యోగి వేమన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ మునగల సూర్యకళావతి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏపీ పీజీసెట్‌-2022 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న16 యూనివర్సిటీలు, అనుబంధ పోస్టుగ్రాడ్యుయేషన్, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, మైనార్టీ కాలేజీల్లో 145 కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.

ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ www.yvu.edu.in లేదా https://cets.apsche.ap.gov.inలో ఆన్‌లైన్‌ విధానంలో జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవల్సిందిగా విద్యార్థులకు సూచించారు.ఆలస్య రుసుము చెల్లించకుండా జులై 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో జులై 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రూ.1000 లేట్ ఫీ తో జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హాల్‌ టికెట్లు ఆగస్టు 5 నుంచి వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఏపీ పీజీసెట్‌-2022 ప్రవేశ పరీక్షలు ఆగస్టు 17 నుంచి 22 వరకు జరుగుతాయి. అభ్యర్థులు ఒక సబ్జెక్టుకు ఒకే అప్లికేషన్, ఒకే ఫీజు చెల్లించడం ద్వారా దాని పరిధిలోని అన్ని కోర్సులకు అర్హులవుతారు..ఇంకా వివరాలు కావలని అనుకోనేవాల్లు వెబ్ సైట్ ను సందర్షించాలి.

Read more RELATED
Recommended to you

Latest news