ఏపీకి గుడ్ న్యూస్.. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే నిధులు మంజూరు చేసిన కేంద్రం..!

-

ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం  గుడ్ న్యూస్ చెప్పింది.  ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే నిధులు మంజూరు చేసింది కేంద్రం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి 5,655.72 కోట్లరూపాయల ను మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు  విజయవాడలో తుదిదశకు చేరుకున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం  కార్యక్రమం ఏర్పాటు కానుంది.

ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు తెలుగు సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం కోసం చిరంజీవి ఇవాళ సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ప్లైట్ లో విజయవాడకు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news