జగన్, చంద్రబాబులను కేసీఆర్‌ కంట్రోల్‌ చేస్తున్నాడు – జీవీఎల్‌

-

జగన్, చంద్రబాబులను కేసీఆర్‌ కంట్రోల్‌ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు జీవీఎల్‌ నరసింహరావు. విభజన సమస్యల పరిష్కారంపై ఢిల్లీ మీద నెపం నెట్టొద్దని.. విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు భేటీ కారు..?అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో చొరవ తీసపకోకుండా కేంద్రాన్ని తప్పు పట్టడం కరెక్టా..? విభజన సమస్యలపై తెలంగాణ సీఎంతో గత, ప్రస్తుత ఏపీ సీఎంలు ఒక్కసారైనా మాట్లాడారా..? కేసీఆరుతో గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని నిప్పులు చెరిగారు.

తెలంగాణ సీఎం తరహాలో మూడు గంటల పాటు ప్రెస్ మీట్లు పెట్టకున్నా.. మూడు నిమిషాలైనా ఏపీ సీఎం ఎందుకు మాట్లాడరు..? జగన్ మాట్లాడితే సెట్లర్ ఓట్ల కోసమైనా కేసీఆర్ స్పందిస్తారని… ఉదయం లేచింది మొదలు. కేసీఆర్ సెట్లర్ల ఓట్ల గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న కేసీఆర్ ఏపీలోని జగన్, చంద్రబాబును కంట్రోల్ చేస్తున్నారనడంలో సందేహం లేదు.. వారి స్వప్రయోజనాల కోసం జగన్, చంద్రబాబు కేసీఆరుతో రాజీ పడుతున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news