BREAKING : కొండేపి నియోజకవర్గంలో టిడిపి, వైసిపిల మధ్య హై టెన్షన్

-

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో టిడిపి, వైసిపిల మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిని ముట్టడించడానికి పిలుపునిచ్చారు వైసిపి ఇన్ ఛార్జ్ అశోక్ బాబు. గత ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ నిధులు ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేశాడని ఆరోపణలు చేశారు.

ఈ తరుణంలోనే చలో తూర్పు నాయుడు పాలెం అంటూ… ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు అశోక్ బాబు. ఇక వైసిపి కి కౌంటర్ గా చలో టంగుటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది టీడీపీ. దీంతో తూర్పు నాయుడుపాలెంలో ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్దకి చేరుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీ ఇన్ ఛార్జ్ అశోక్ బాబు తీరుపై మండిపడుతోంది టీడీపీ. వైసీపీ ఇన్ ఛార్జ్ అశోక్ బాబు తీరుని నిరశిస్తూ నాయుడుపాలెం నుండి భారీ ర్యాలీగా టంగుటూరు బయలు దేరారు ఎమ్మెల్యే స్వామి, టీడీపీ శ్రేణులు.

Read more RELATED
Recommended to you

Latest news