రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించిన చరిత్ర కేసీఆర్ కే దక్కుతుంది – VH

-

ఒడిశా రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. 20 ఏళ్ల తర్వాత ఘోర రైలు ప్రమాదం జరిగిందని అన్నారు. రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నేడు గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఎన్నికల హామీలను అమలు చేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడినా ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు.

తెలంగాణలో కూడా కేసీఆర్ అనేక హామీలను ఇచ్చారని.. కానీ ఆయన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ పెట్టి కెసిఆర్ మహారాష్ట్రలో తిరుగుతూ రైతు రాజ్యం అంటున్నాడని.. ఖమ్మంలో రైతులు ధర్నా చేస్తే వారికి సంకెళ్ళు వేసిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు వీహెచ్. రైతులపై నాన్ బేలబుల్ కేసులు పెట్టిన చరిత్ర కూడా కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news