కాణిపాకం ఈవో పై వేటు.. షోకాజ్ నోటీసులు జారీ

-

చిత్తూరు జిల్లా కానిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో అభిషేకం టికెట్ ను రూ. 700 నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నట్లు నోటిఫికేషన్ ఇచ్చిన ఇంచార్జ్ సురేష్ బాబు పై దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంది. సురేష్ బాబు ను బాద్యతల నుంచి తప్పించడమే కాకుండా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సురేష్ బాబు స్థానంలో ఆలయానికి కొత్త ఇవో గా రానా ప్రతాప్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో ఇక్కడ ఇన్చార్జి ఈవోగా పనిచేస్తున్న సురేష్ బాబును రాజమహేంద్రవరం ఆర్జెసి ( రీజినల్ జాయింట్ కమిషనర్) గా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. గత రెండు రోజుల క్రితం కాణిపాకం ఆలయంలో అభిషేకం టికెట్ ధరలను పెంచుతూ సురేష్ బాబు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బాధ్యతారహితంగా వ్యవహరించారు అంటూ సురేష్ బాబు పై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Read more RELATED
Recommended to you

Latest news