కెసిఆర్ కాదు కదా.. ఆయన తాత వచ్చినా మాకు నష్టం లేదు – ఏపీ మంత్రి కారుమూరి

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కాదు కదా.. కెసిఆర్ తాత వచ్చినా వైసీపీకి జరిగే నష్టమేమీ లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సీఎం జగన్ సింహం లాంటి వారని.. ఒంటరిగానే పోటీ చేస్తారని చెప్పారు.

బిఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా వైసిపి భారీ మెజారిటీతో గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా గుర్తు చేశారు మంత్రి కారుమూరి. వ్యతిరేక ఓటును చీల్చకుండా చూడాలని పవన్ సహా పలువురు నేతలు భావిస్తున్నారని.. అయితే తమకు ఉన్నదంతా కలిసివచ్చే ఓటేనని, తమకు వ్యతిరేక ఓటు అన్నదే లేదని తెలిపారు. అలాగే అమరావతి రైతు యాత్ర పూర్తిగా టిడిపి నేతల యాత్ర అని ఆరోపించారు. అమరావతి రైతు యాత్రలో బెంజ్ కార్లు, బంగారు రిస్ట్ వాచ్ లు ఉన్నవాళ్లు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news