ఏపీ గర్భిణులకు జగన్‌ శుభవార్త..ఆ పరీక్షలు ఉచితం

-

ఏపీ గర్భిణులకు జగన్‌ శుభవార్త. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా గర్భిణులకు కొత్తగా ఉచితంగా ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామాలిటీస్) స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు.

ఈ స్కానింగ్ ద్వారా గర్భస్థ శిశువుల లోపాలను గుర్తించి, ముందుగానే జాగ్రత్తపడేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో రేడియాలజిస్టులు ఉన్నచోట ఈ టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం త్వరలోనే వస్తుందన్నారు. విజయవాడలోని బోధనాసుపత్రిలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news