కాపు మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. రేపే అకౌంట్‌లో డబ్బులు

-

అమరావతి: వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు విడుదల చేయనుంది ఏపీ సర్కార్‌. వర్చువల్‌ ద్వారా నేరు లబ్దిదారుల ఖాతాల్లో రేపు జమ చేయనున్నారు  ఏపీ సీఎం జగన్‌. కాపు, బలిజ, తెలగ కులస్తుల, ఒంటరి మహిళల అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్‌.

నిరుపేదలుగా ఉన్న కాపు అక్క, చెల్లెమ్మలకు ఆర్థిక స్వాలంబన రావాలని ఈ మంచి పథకాన్ని తీసుకువచ్చారు సిఎం జగన్. వైయస్సార్‌ చేయూత మాదిరిగానే వైయస్సార్‌ కాపునేస్తం తీసుకు వచ్చారు.

ఈ పథకం ప్రకారం క్రమం తప్పకుండా ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తూ పోతే ఐదేళ్లపాటు ఇలా 75 వేలు అక్క చెల్లెమ్మల చేతిలో ఉంతుందన్న మాట. తన కాళ్లమీద వాళ్లు నిబడగలుగుతారనే గొప్ప ఆలోచన నుంచి ఈ పథకం పుట్టింది. ఈ రెండు సంవత్సరాల్లో అక్షరాల వివిధ పథకాల ద్వారా 59,63,308 మందికి గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా 15 రెట్లు మేర రూ. 12,126.78 కోట్లు సహాయం చేసింది సర్కారు.

Read more RELATED
Recommended to you

Latest news