కోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా జగన్ సర్కార్ కి బుద్ధి రావడం లేదు – నారా లోకేష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. కోర్టు ఎన్ని సార్లు చివాట్లు పెట్టినా జగన్ సర్కార్ కి బుద్ధి రావడం లేదని సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“కోర్టు ఎన్ని సార్లు చివాట్లు పెట్టినా జగన్ సర్కార్ కి బుద్ది రావడం లేదు. పోలీస్ వ్యవస్థ ని రాజకీయ కక్ష సాధింపు సంస్థ గా మార్చుకున్నారు. బిసి నేత అయన్నపాత్రుడు గారి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న ట్రెండ్ సెట్ అపార్ట్మెంట్ లో చింతకాయల విజయ్ ఇంటికి ఎటువంటి నోటీసులు లేకుండా వెళ్లిన ఏపి పోలీసులు అక్రమ అరెస్ట్ కి ప్రయత్నించడం దారుణం.

ఎందుకు వచ్చారో చెప్పకుండా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడి, కుటుంబ సభ్యులు, ఇంట్లో పని చేసే వారి పై బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేరాలు – ఘోరాలు చేస్తున్న వైసిపి నేతలకు సన్మానాలు చేసి పదవులు కట్ట బెడుతుంది ప్రభుత్వం. ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న టిడిపి నేతల పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు జగన్ రెడ్డి. అయన్నపాత్రుడు గారి కుటుంబాన్ని టచ్ చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టం. వైసిపి అధికార మదాన్ని అణిచివేస్తాం”. అని ట్వీట్ చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news