సినిమా టికెట్లపై జగన్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల

-

అమరావతి : సినిమా టికెట్లపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ల ఆన్ లైన్లో విక్రయానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆన్ లైన్లో సినిమా టిక్కెట్ల విక్రయానికి అనుమతిస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే నోడల్ ఏజెన్సీగా APSFTVTDC ఉండనున్నట్లు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది.

APSFTVTDC ద్వారానే ఆన్ లైన్ టిక్కెటింగ్ వెబ్ సైట్ రూపకల్పన, టిక్కెట్ల అమ్మకం జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2 శాతం మేర సర్వీస్ ఛార్జెస్ ను వసూలు చేసుకునేందుకు APSFTVTDCకు అనుమతి ఇచ్చింది.

ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్లు అమ్ముకుంటున్న సంస్థలు కూడా నోడల్ ఏజెన్సీ పరిధిలోనే బిజినెస్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆన్ లైన్లో టిక్కెట్లు అమ్మకాలపై థియేటర్ యాజమాన్యాలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్న APSFTVTDC…త్వరలోనే ఆన్ లైన్ టిక్కెటింగ్ వెబ్ సైట్ రూపకల్పన చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news