నేడు ఢిల్లీకి సిఎం జగన్.. ముందస్తు ఎన్నికలే టార్గెట్ !

-

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనku ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు సిఎం వైఎస్‌ జగన్‌. ఈ పర్యటన లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులను కలిసి భేటీ కానున్నారు సిఎం వైఎస్‌ జగన్‌. ఈ మేరకు ప్రధాని మోదీతో షెడ్యూల్‌ ఖరారు చేస్తున్నారు అధికారులు.

ప్రధాని మోడీ తో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించనున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో వీటి పై క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జగన్ దావోస్ లో ఉన్నప్పుడే మోదీ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముందస్తు ఎన్నికల అంచనాలతో నే వైసిపి రాష్ట్రంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఇందుకు తగినట్లుగానే విపక్షాలు కూడా జనంలో ఉంటున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news