విద్యార్థులకు శుభవార్త..ఈ నెల 25న ‘జగనన్న విద్యా దీవెన’ నాలుగో విడత సాయం

-

విద్యార్థులకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. ఈ నెల 25న ‘జగనన్న విద్యా దీవెన’ నాలుగో విడత సాయం అందనుంది. మదనపల్లెకు ఈనెల 25వ తేదీ సీఎం జగన్ రానున్నారు. నాలుగో విడత విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొని విద్యాదీవెన సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం కలెక్టర్ గిరీషా, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే నవాజ్ భాషా, జెసి తమీమ్ అన్సారియా మదనపల్లిలో పర్యటించి సభ స్థలాలను పరిశీలించారు.

పట్టణంలోని కదిరి రోడ్డు పక్కన టిప్పు సుల్తాన్ మైదానం, బీటీ ప్రభుత్వ కళాశాల మైదానం, చిప్పిలి డైయిరీ వెనుక ఉన్న ఖాళీ స్థలాలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా దీవెన పంపిణీలో భాగంగా వచ్చే బుధవారం సీఎం మదనపల్లెకు వస్తున్నారన్నారు. రెండు మైదానాలను ఎంపిక చేసి ఒకదానిలో హెలిప్యాడ్, రెండో దానిలో సభ నిర్వహించనున్నమన్నారు. తక్కువ సమయం ఉన్నందున పనులు వేగంగా నిర్వహించాలని అధికారులు ఆదేశించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news