బాబాయ్ ని చంపించేశావు..తల్లి, చెల్లిని తరిమేశావు..మాకు ఇదేం ఖర్మ – లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం, మోరంపుడి గ్రామంలో నిర్వహించిన ‘ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. జనం నిన్ను ఎలా నమ్ముతారు జగన్ రెడ్డి? అని నిలదీశారు.

 

బాబాయ్ ని చంపించేశావు.. సొంత తల్లి, చెల్లిని తరిమేశావు. కులం, మతం, ప్రాంతం చూసుకుని నీ సహనిందితులకే పదవులు పంచావు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన జగన్ రెడ్డిని దింపితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.

 

గ్రామంలో అధిక ధరలు, పన్నుల భారం తీవ్రంగా ఉందని గ్రామస్తులు వివరించారు. రోడ్లు, కాలువలు లేక నానా ఇబ్బందులూ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన లేక మూడు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని వాపోయారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news