లోకేష్ జీవితంలో అసెంబ్లీలోకి రాలేడు: మంత్రి రోజా

-

శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి ఆర్.కె.రోజా. స్వామివారి దర్శనం అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పదవ తరగతి ఉత్తీర్ణత పై టిడిపి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మహానాడులో తొడగొట్టి రమ్మని పిలిచిన టిడిపి నాయకులు.. లోకేష్ జూమ్ మీటింగ్ కి కొడాలి నాని, వంశీ వస్తే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు.

జీవితంలో లోకేష్ అసెంబ్లీ లోకి రాలేడని రోజా జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతే టిడిపిని మూసేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పదే పదే ప్రకటనలు చేస్తున్నారని.. 2019 నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో టిడిపి ఓడిపోతుందని మంత్రి గుర్తు చేశారు.

పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పై కూడా రోజా ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు ప్రారంభిస్తున్నాడో ప్రజలకు చెప్పాలని ఆమె నిలదీశారు. జనసేన పార్టీని పెట్టింది ఎవరికోసం అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి పవన్ పాకులాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news