ఆర్‌ఆర్‌బీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వారి కోసం ప్రత్యేక రైళ్లు.

-

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) పరీక్షలు రాసే అభ్యర్థులకు దక్షిణ మధ్య రైల్వే శాక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది.

South Central Railway to run special trains to clear extra rush

ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆ రోజు వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. నేడు తిరుపతి-సేలం, సేలం-తిరుపతి (07675/07676), 12న తిరుపతి-సేలం (07441), 13న సేలం-తిరుపతి (07442), 13న షాలిమార్-సికింద్రాబాద్ (08025), 14న షాలిమార్-సికింద్రాబాద్ (08035), 16న సికింద్రాబాద్-షాలిమార్ (08026), 17న సికింద్రాబాద్-షాలిమార్ (08036) రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news