“జనం చెవిలో జగన్ పూలు”..వీడియో రిలీజ్ చేసిన నారా లోకేష్

-

తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌… ఎప్పుడు ఏపీ సీఎం జగన్‌ పై సెటైర్లు వేస్తూనే ఉంటారు. ఆయన మీడియా ముందు కంటే… తన సోషల్‌ మీడియా వేదికగానే…. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తారు. ఇవాళ ఏప్రిల్‌ 1 తేదీ అయిన నేపథ్యంలో.. ఏపీ ప్రజలను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… ప్రజలను ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తున్నాడని.. నారా లోకేష్‌ సెటైర్‌ వేశారు.

ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. అధికారంలోకి రాకముందు.. ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. వాటికి విభిన్నంగా జగన్‌ ప్రవర్తిస్తున్నాడంటూ.. ఈ వీడియో ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు లోకేష్‌.

కరెంటు ఛార్జీలు పెంపు, మూడు రాజధానుల అంశం, నాణ్యమైన రేషన్‌ బియ్యం, ఉద్యోగుల పీఆర్సీ, మద్య పాన నిషేధం, ప్రత్యేక హోదా లాంటి అంశాలపై గతంలో ఇచ్చిన హామీలకు విరుద్దంగా పని చేస్తున్నారని.. జగన్‌ ను టార్గెట్‌ చే శారు నారా లోకేష్‌. ప్రస్తుతం లోకేష్‌ విడుదల చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news