విశాఖ వాసులూ అలెర్ట్ అవ్వండి… తుఫాన్ వచ్చేస్తుంది…!

-

ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తూ వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తుంది. అక్కడి నుంచి పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఈ నెల 11 సాయంత్రానికి ఉత్తరాంధ్రలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రేపు విస్తారంగా వర్షాలు, ఎల్లుండి అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు.

రేపు, ఎల్లుండీ తెలంగాణ రాయలసీమల్లో చెదురుమదురు భారీ జల్లులతో ఓ మోస్తరునుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయి… సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని… కనుక మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సముద్రం లో వేటకు వెళ్ళొదని అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news