BREAKING : ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మంత్రి మేకపాటి అంత్య‌క్రియ‌లు పూర్తి…

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాసేపటి క్రితమే ప్రభుత్వ లాంఛనాలతో మేకపాటి అంత్యక్రియలను…. నెల్లూరు జిల్లాలోని…. ఉదయగిరి మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు అధికారులు. ఇక మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఏపీ మంత్రులు అందరూ మేకపాటి అంత్యక్రియల్లో పాల్గొనడం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మేకపాటి పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

ఇవాళ విదేశాల నుంచి వచ్చిన మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు… ఆయన తండ్రికి అంత్యక్రియలు చేశారు. ఇక ఈ అంతక్రియల కార్యక్రమానికి వేలాది మంది ఆయన అభిమానులు వచ్చారు. ఈ అటు మేకపాటి అంతక్రియల ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా సోమవారం రోజున మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి గుండెపోటు కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు ఉదయం పూట హార్ట్ ఎటాక్ రావడంతో… వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news