జూనియర్ ఎన్టీఆర్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు !

-

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు పిచ్చాసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని చురకలు అంటించారు. కుప్పంలో చంద్రబాబు కోట కోట కూలిపోతోందని నిప్పులు చెరిగారు రోజా.

అందుకే పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసం బటన్ నొక్కినా దాన్ని రాద్దాంతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని మండిపడ్డారు రోజా.
మొన్నటి వరకు ఒక ఫేక్ వీడియోను తిప్పారు ఇప్పుడు ఈ రకంగా ఆరోపణ చేస్తున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు.

జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా ను కలిసిన దగ్గర నుండి చంద్రబాబుకు వణుకు మొదలైందని సెటైర్లు పేల్చారు. బాలకృష్ణ ఆరోగ్య రథం ప్రారంభించినప్పుడు కూడా ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలు మాత్రమే రథంపై ఉన్నాయని ఎద్దేవా చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news