చంద్రబాబుకి సవాల్ విసిరిన మంత్రి విడదల రజిని

-

కృష్ణా: నేడు గుడివాడలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు మంత్రి విడదల రజనీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే తన ఐదేళ్ల పాలలో చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. ఆరోగ్యశ్రీ పేరు ఎత్తే అర్హత చంద్రబాబు, లోకేష్ కు లేదన్నారు. మ్యానిఫెస్టో అంటూ చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు.

నమ్మకం కోల్పోయిన చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరని అన్నారు. ఇచ్చిన హామీలు పూర్తి చేసిన జగన్ ప్రజలకు భరోసా ఇచ్చారని అన్నారు. చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసినా గుడివాడలో కొడాలి నానిని ఓడించడం అసాధ్యం అన్నారు విడదల రజిని. టిడిపి నేతలు డైలాగులుకే పరిమితం అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తో పాటుగా కొడాలి నానికి ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version